Home » Karnataka
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్కు చెందిన వారు హాట్టాపిక్ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా ఒకరు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.
రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్ క్యాప్ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.
కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.
కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్స్టేషన్ పరిధిలో బెణకల్ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.
ఎలక్ట్రికల్ బస్సులతోనే సమస్య నెలకొందని తరచూ నగరంలో ప్రమాదాలు, బ్రేక్డౌన్లకు అవే కారణమని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy) తెలిపారు. విధానసౌధలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలనలో ఎలక్ట్రికల్ బస్సులకు 80శాతం రాయితీ ఇచ్చి కార్పొరేషన్లకు అప్పగించేవారన్నారు.
మాజీ ఎమ్మెల్యే బీఎన్ మహా లింగప్ప తన ఇంటి బయట నిలబడి పోటీలను చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఆయనపైకి దాడికి దిగింది. కొమ్ములతో కుమ్మి, నేలపై పడేసింది.