Home » Karnataka Congress
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.
ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.
కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.
కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ..
Karnataka Power: కర్ణాటక రాష్ట్రంలో ‘విద్యుత్’ విషయంపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం అంతా ఇంతా కాదు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో...
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు నానాతంటాలు...
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతేడాది రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు చెలరేగి, రాష్ట్రమంతా అల్లర్లు జరుగుతుంటే.. అప్పటి ప్రభుత్వం చోద్యం చూస్తూ...
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.