Home » Kamal Haasan
తమిళనాట తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్ భరోసా ఇచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు.
దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్హాసన్(Kamal Haasan) అన్నారు.
రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజల హక్కు, ఆ హక్కులను ప్రజలు నెరవేరుస్తూ ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) తెలిపారు.
డీఎంకేతో పొత్తుపెట్టుకున్న మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ససేమిరా కుదరదంటూ భీష్మించారు.
లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు.
ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan) విమర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్(Kamala Haasan) నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ డీఎంకే కూటమిలో స్థానం మాత్రమే సంపాదించుకుంది.
లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో కమల్ పార్టీ 'మక్కల్ నీథి మయ్యం' శనివారంనాడు చేరింది.
లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియక మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్(Kamala Haasan) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.