Home » Kakinada
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పవరం ఇన్ఛార్జి సీఐ రవికుమార్ను ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు నుంచి తొలగించారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డబ్బులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడి నలుగురు సాక్షులు పోలీసులను ఆశ్రయించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారి గన్ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది.
తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికను త్రాచుపాము కాటేసింది. ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.
ఏసీ వాటర్ పడుతున్నాయనే కారణంగా అన్నాచెల్లెళ్లపై బ్లేడ్తో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.