Home » JD Vance
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై సొంత పార్టీలోనే విభేదాలు పెరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక సెనెటర్ అధ్యక్షుడి తీరును విమర్శించిన ఆడియో ఒకటి లీకై అమెరికాలో కలకలం రేపుతోంది.
దాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు పగిలాయి. వాన్స్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారా, వేరే కారణం ఏదైనా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఆయన భార్య ఉషా చిలుకూరికి మధ్య బంధం బీడలు వారుతుందా?. ఇప్పుడు ఇదే అంశం యూఎస్ఏ సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. అక్టోబర్ 28న ఓ యూనివర్సిటీలో జేడీ వాన్స్, ఇటీవలే దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉషాపై జేడీ వాట్స్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
India Pak Tensions: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, పాక్ యుద్ధంపై స్పందించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అన్నారు.
JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి తాజ్మహల్ వద్ద ఆహ్లాదంగా గడిపారు. పర్యటన అనంతరం ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు..
భారతీయ వంటకాలకు మక్కువతో జేడీ వాన్స్ స్వయంగా వంటలు చేస్తారని ఉషా వాన్స్ తెలిపారు. పిల్లలు రామాయణ, మహాభారతాలపై ఆసక్తి చూపిస్తూ భారత పర్యటనను జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమవుతుండగా, మోదీ ప్రజాదరణపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. భారత్ అణుశక్తి లక్ష్యాల సాధనలో అమెరికా భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు
JD Vance Jaipur Tour: జైపూర్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ విలాసవంతమైన రాంబాగ్ హోటల్లో బస చేస్తున్నారు. ఇక ఈరోజు జైపూర్ పర్యటనలో భాగంగా రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్ఐసీ)లో వాన్స్ ప్రసంగించనున్నారు.
భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన హైలైట్గా నిలిచింది. మోదీతో సమావేశం, వాణిజ్య చర్చలు, కుటుంబానికి విందు, పిల్లలకు నెమలి ఈకలతో పలు ప్రత్యేక క్షణాలు చోటుచేసుకున్నాయి