Home » Jammu and Kashmir
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
పహల్గాం దాడితో కశ్మీర్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వెళ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ కీలక ప్రకటన చేసింది. ఈ దాడికి తామే బాధ్యులమని తొలుత జెబ్బలు చరుచుకున్న సంస్థ.. తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. తాము దీనికి బాధ్యులము కాదని స్పష్టం చేసింది.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా నిలబడాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు శ్రీనగర్ వెళ్లిన ఆయన, లెఫ్టినెంట్ గవర్నర్ మరియు మాజీ సీఎంతో భేటీ అయ్యారు
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్కు నీటి పంపకాన్ని నిలిపివేయనున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్కు భారత్ కఠినంగా స్పందించింది
ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ అంగీకరించారు. పశ్చిమ దేశాల కోసం ఈ చర్యలు చేశామని, ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామని తెలిపారు
పాక్కు గుణపాఠం ఖాయమని మాజీ డీజీపీ రాజేంద్రకుమార్ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాక్కు భవిష్యత్తులో భారీ నష్టాలను తెస్తుందనీ, ఉగ్రవాద మద్దతుతో బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు
పాక్పై సైనిక చర్యలకు సంబంధించిన నాలుగు కీలక మార్గాలను రక్షణ నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. వీటిలో ఆధునిక యుద్ధ విమానాలతో దాడులు, నియంత్రణ రేఖ వెంట దాడులు, సర్జికల్ దాడులు, మరియు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడం ఉన్నాయి
బందీపోరా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. పహల్గాం దాడి తర్వాత చేపట్టిన గాలింపులో ఈ విజయంతో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ పడింది
పహల్గాం ఉగ్రదాడి సమయంలో ప్రాణాల పరవశంలోనూ విధేయతను చూపిన కశ్మీరీ గైడ్ నజకత్ షా, ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడాడు. పర్యాటకుల భద్రతకే తన బాధ్యతగా భావించిన ఆయన, ప్రాణాలతో పోరాడుతూ ఆదర్శంగా నిలిచాడు