Home » Jammu and Kashmir
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Operation Sindoor: భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు. పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలోనే దాదాపు 2వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
Indian Forces: భారత్ మీదకు దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటు అటాక్లో విఫలమవుతున్న దాయాది.. అటు డిఫెన్స్లోనూ చతికిలపడుతోంది.
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ సహా పలు ప్రాంతాల ప్రజలు ఢిల్లీకి చేరుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడులను పహల్గాం బాధితుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం ప్రశంసించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయని, న్యాయం జరిగిందని బాధిత కుటుంబం పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టార్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్లు, మోర్టార్లను ప్రయోగించిందని, విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.
ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్ దాడుల్లో 15 మంది భారత పౌరులు మరణించగా, మరో 43 మంది గాయపడ్డారు.