Home » ISRO
ఇస్రో శాస్త్రవేత్తలు LVM3-M5 రాకెట్ను సక్సెస్ఫుల్గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది.
ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో శక్తివంతమైన ఉప్రగహాలను నింగిలో ప్రవేశ పెట్టింది. తాజాగా అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచ్ వెహికల్ మార్క్-3(ఎల్వీఎం–3) రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది.
శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్ రెడీ చేసుకోవాలని సూచించారు.
కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇస్రో వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేశారని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఈ సమయంలో అన్ని ఎర్త్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అద్భుతంగా పనిచేశాయని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
నెల్లూరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో గగన్యాన్ మిషన్ల కోసం ఒక పరీక్షను విజయవంతం చేసింది. ఇది మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత..
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మక రోడ్మ్యాప్ను వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం 2035 నాటికి ఇండియా సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS) ఏర్పాటు చేసుకుంటుందని అన్నారు.
అంతరిక్షంలో 2035 నాటికి భారత్ సొంతంగా ఏర్పాటు చేయనున్న భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనాను ఇస్రో ఆవిష్కరించింది...
అంతరిక్షం నుంచి భారత్ను చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేసే వీడియోను వ్యోమగామి శుభాన్షూ శుక్లా తాజాగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.