Home » Israel
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సర్దుమణిగినట్టైంది.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు అంగీకరించినందుకు ఇరు దేశాలకు అభినందనలు తెలిపారు.
Israel Iran War: న్యూక్లియర్ బాంబుల తయారీనే ఇరాన్ కొంపముంచింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండటం తమకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. అణు బాంబుల తయారీని అడ్డుకోవడానికి 10 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై వైమానిక దాడులు చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దాదాపు పదకొండు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగింది.
మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే వీలుందని అంటున్నారు.
ఇరాన్లోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో మిసైళ్లు నిల్వ చేసిన స్థావరాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు నాశనమయ్యాయని వెల్లడించింది.
హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ఆందోళన రేకెత్తించడంతో అమెరికా చైనా సాయాన్ని అభ్యర్థించింది. ఇరాన్ మనసు మార్చాలని కోరింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్వయంగా వెల్లడించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం బీ2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై బీయూ-57 బంకర్-బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, అమెరికా కూడా రంగంలోకి దిగి దాడులు చేయడంతో పర్షియన్ గల్ఫ్లో గగనతలం ప్రమాదకరంగా మారింది.
ఇరాన్ అణు స్థావరాలపై మెరుపు వేగంతో దాడి చేసిన అమెరికా.. అసలు దాడి ఎలా చేశామన్నది చెప్పింది. ఇరాన్ను ఏమార్చి దెబ్బకొట్టామన్న అగ్రరాజ్యం.. ఈ దాడులు ఒక అద్భుతమని పేర్కొంది. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరిట ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామన్న అమెరికా..