Home » Israel
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది.
ఇజ్రాయెల్పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబు దాడులు, పేలుళ్లు, ఆహార కొరత, ఆకలి మాంద్యంతో ఇప్పటివరకు
ఇజ్రాయెల్లో ఒక పాలస్తీనియన్ సోమవారం హల్చల్ చేశాడు. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఏకంగా ఓ కారును దొంగిలించి అక్కడి స్థానిక ప్రజలను ఢీకొట్టాడు.
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.