Home » Israel
ఇరాన్ మీద జరుపుతున్న యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్సభకు వెల్లడించారు.
ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ఆయన ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధం కంటే చర్చలే మార్గమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.
ట్రంప్ వార్నింగ్ వేళ ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ ఐల్యాండ్లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్ను కూల్చేశామని తెలిపింది. టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది.
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ కారణంగా కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు చిక్కుకున్నాయి. జపాన్ నుంచి దుబాయ్ చేరాల్సిన 4 వేల కార్లు కెన్యా పోర్టులో నిలిచిపోయాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.