Home » Israel
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్తా సంస్థ ఒకటి ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.
యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని గాంధీ ఆసుపత్రి దెబ్బతిందంటూ ఇరాన్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోతే.. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్పై దాడి చేయటం తమ కర్తవ్యం అని అన్నారు.
ఇరాన్ మిసైల్ సామర్థ్యాలను తాము ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా పేర్కొన్నారు. తన ఉనికి కోసం పోరాడే స్థితికి ఇరాన్ చేరుకుందని కామెంట్ చేశారు.
లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇజ్రాయెల్ను క్యాన్సర్గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్ను డిలీట్ చేయించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు.
లెబనాన్తో వీలైనంత త్వరగా శాంతి చర్చలు ప్రారంభించాలని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా తెలిపారు.