Home » Iran War
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్తో కొనసాగుతున్న దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశావహంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తర ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది.
కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ చేసిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరకొరు గాయపడ్డారు.
ఇరాన్తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా వద్ద వైమానిక రక్షణ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద కావలసిన వాటికంటే, చాలా ఎక్కువ ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఇరాన్పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
యెమెన్పై దాడులు చేసిన సౌదీపై తామూ ప్రతీకార దాడులు చేశామని హౌతీ మిలిటెంట్లు తాజాగా పేర్కొన్నారు.
వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.