Home » IPL
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ ముకుల్ చౌదరి ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టమని వెల్లడించాడు.
ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ ఫిట్నెస్ సాధించడంతో జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వెంకటేశ్ అయ్యర్ను తప్పిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీకి పలు కీలక సూచనలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. నేడు పంజాబ్ కింగ్స్.. లఖ్నవూ సూపర్ జెయింట్స్తో చావో రేవో మ్యాచ్ ఆడనుంది. మరి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఫ్యాన్స్, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. అయితే ఇలాంటి ఆటగాడు వచ్చిన బిహార్కూ ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని బిలియనీర్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. భారత్లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన వేదాంతా గ్రూప్నకు ఆయన ఛైర్మన్.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ప్లే ఆఫ్స్కు ముందే ముగిసింది. గుజరాత్ టైటాన్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘోర ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే వైఫల్యాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.