Home » India Vs Bangladesh
సూపర్-4లో బంగ్లాదేశ్తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు.
ఈ మ్యాచ్లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.
టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి క్రీడాకారిణి అన్న మిథాలీ.. ఆమె యువ క్రీడాకారిణులకు రోల్ మోడల్ అన్నారు. కనుక వారంతా హర్మన్ప్రీత్ కౌర్ను అనుసరించాలని అనుకుంటారని, కాబటి మైదానంలో, మైదానం వెలుపల హర్మన్ ప్రీత్ కౌర్ గౌరవప్రదంగా నడుచుకోవాలని మిథాలీ సూచించారు.
టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.
బంగ్లాదేశ్ ఉమెన్స్తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్కు ప్రతికూలంగా మారింది.
భారత్ ఉమెన్స్తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు ఓపెనర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ఫర్గానా హోక్.. మహిళల వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్గా చరిత్ర నెలకొల్పింది. ఈ క్రమంలో 10 ఏళ్ల నాటి రికార్డును ఫర్గానా హోక్ బద్దలుకొట్టింది.
సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జెమిమా రోడ్రిగ్స్ ఆల్రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.
బంగ్లాదేశ్ పర్యటనటో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మహిళల క్రికెట్ వన్డే ఫార్మాట్లో భారత్పై బంగ్లాదేశ్కు ఇదే మొదటి విజయం.