Home » Hyderabad
తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
నగరంలో పనిచేస్తున్న కొంతమంది యువ ఎస్సైల పనితీరు వివాదాస్పదమవుతోంది. వారు.. కేవలం దోచుకునేందుకే డిపార్టుమెంట్ లోకి వస్తున్నారా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలొస్తున్నారయి. యూనిఫారం ధరించిన నాటినుంచే అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖ నగరంలో చోటుచేపుకుంది. హైదరాబాద్కు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (57) అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే.. కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగరంలో ఆయా ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉండని ఏరియాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం పంచాయితీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్కాంలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు హరీష్ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చనిపోకపోయినా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చేదని అన్నారు.
ఐటీ కంపెనీ అంటూ హడావుడి చేశారు. మంచి కోర్సులకు శిక్షణ ఇచ్చి తమ కంపెనీలోనే ఉద్యోగాలు ఇస్తామంటూ దాదాపు 400 మంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తం 12 కోట్ల రూపాయల వరకూ దోచేసి, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు.
తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎమ్ఎస్ఎమ్ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు.