Home » Hyderabad Metro Rail
హైదరాబాద్ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సమయాల్లో సవరణ చేసినట్లు ప్రకటించారు. సవరించిన ప్రయాణ వేళలు నవంబరు మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ నిర్వహణ బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తప్పుకోబోతోంది. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాబోతోంది. రెండో దశ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా..
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ నిర్మాణాన్ని వినూత్నంగా చేపట్టనుంది. విదేశాల్లోని సాంకేతికతను వినియోగించి నూతన తరహాలో కారిడార్లను పూర్తి
చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్కు విద్యుత్ సంస్థ నోటీసులు జారీ చేసింది.రూ. 31,829 బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు విద్యుత్తు కనెక్షన్ తీసుకుంది.
పాతబస్తీ మెట్రో కారిడార్ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు పాతబస్తీలో మెట్రో పిల్లర్ల పనులకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టుకు సంబంధించి కనీసం 50 శాతం పనులైనా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.