Home » Heat
ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమైంది.
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.