Home » Guntur
ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Jagan Vehicle Inspection: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి.
రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో వేగంతోపాటు నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి, పోలీసు సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.
రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది.
గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశానని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు ఎన్నికయ్యారు.
Jagan Case Filed: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
YS Jagan Sattenapalli Tour: 22 ఏళ్ల తెల్లజర్ల మధు కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మధును పరీక్షించిన వైద్యులు అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ధ్రువీకరించారు.