AI Hackathon: నేడు గుంటూరులో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:40 AM
రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో వేగంతోపాటు నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి, పోలీసు సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం: డీజీపీ హరీశ్ గుప్తా
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో వేగంతోపాటు నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి, పోలీసు సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు. అందులో భాగంగా సీఎం చేతుల మీదుగా గుంటూరులో ‘ఏఐ హ్యాకథాన్’ను శుక్రవారం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత సవాళ్లతోపాటు రాబోయేరోజుల్లో ఎదు రయ్యే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా ఏఐ నిపుణులు ఇచ్చేటూల్స్ను ఎంపిక చేసుకుని రూ.పది లక్షలవరకు బహుమతులు ఇస్తామని డీజీపీ చెప్పారు.