Home » Guntakal
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్-సికింద్రాబాద్ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు.
తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్ అలీపై షేక్ షమీమ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్టౌన్ పోలీసులకు ఆశ్రయించారు.
ఎన్నడూ లేని విధంగా హంద్రినీవా కాలవలోకి భారీ గా వర్షం నీరు చేరింది. హంద్రినీవా కాలవలో ఓ వైపు విస్తరణ, మరోవైపు లైనింగ్ పనులు జరుగు తున్న క్రమంలో వర్షంనీరు చేరడం పనులకు ఆటం కంగా మారింది. 25 కిలోమీటర్ల మేర భారీగా చేరిన వర్షపు నీటిని రాగులపాడు పంపుహౌస్ నుంచి పీఏబీఆర్కు వదిలినట్లు హంద్రినీవా ఎస్ఈ రాజా స్వరూప్కుమార్ తెలిపారు.
వేసవిలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి బెంగళూరు-కలబురగి మధ్య ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్లో స్టాపింగ్ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక రైల్వే స్టేషనలో వివిధ ప్లాట్ఫాంల ట్రాక్ అనుసంధానం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. గుంతకల్లు రైల్వే స్టేషనలో ఏడు ప్లాట్ఫాంలు ఉన్నాయి. అయితే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్ఫాంల ట్రాక్ అనుసంధానం జరగని కారణంగా రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు...
సంతసేవాలాల్ జయంత్యుత్సవాలు గురువారం నుంచి సేవాఘడ్లో ప్రారంభంకానున్నాయి. సంత్సేవాలాల్ 286 సంవత్సరాల కిందట జన్మించి ఎన్నో మహిమలను చూపి, సుగాలీ జాతి జాగృతి కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఖమ్మం రైల్వే స్టేషన్(Khammam Railway Station)లో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నాలుగు రైళ్లను గుంతకల్లు(Guntakal) మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు.