Home » Gali Janardhan Reddy
ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.
మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలుశిక్షను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది.
OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో గాలి సహా దోషులందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ిసీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దోషులుగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఇతర నిందితులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.
OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు నిందితులు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.