Home » Gachibowli
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు.. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తొలి సమీక్ష నిర్వహించారు. ఆ భూముల అంశానికి అనుబంధంగా ఉన్న అన్ని శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు.
హెచ్సీయూ భూముల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిసినా.. కేటీఆర్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు.
ఇష్టమొచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ వందెకరాలనూ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర ఆరు నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతాం.
కంచ గచ్చిబౌలిలో ఉన్నది అటవీ భూమి కాదని, అది ప్రభుత్వ పోరంబోకు భూమి మాత్రమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కు నిర్మించాలని భావించామని వివరించింది.
Hyderabad Drug Bust: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో పెద్దఎత్తున డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి బయో డైవర్సిటీ విభాగ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మొక్కల పెంపకం బిల్లుపై సంతకం కోసం కాంట్రాక్టర్ వద్ద రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారు