Home » Eluru
Andhrapradesh: ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో అధికారుల అలసత్వం కారణంగా స్వామివారి ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది.
Andhrapradesh: జిల్లాలోని పెదవేగి మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.
Andhrapradesh: మహాత్మాగాంధీ వర్ధంతి రోజున అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన ధర్నాకు దిగారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 1, 2 పనులు పూర్తి చేయాలంటూ నూజివీడులో రైతులు, రైతు సంఘ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బండి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఆగిరిపల్లి మండలం కనసానపల్లె గ్రామ మామిడితోటలో విజయవాడ మొగల్ర్రాజపురంకు చెందిన ఐదుగురు స్నేహితులు ఆదివారం అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకున్నారు. కేక్ కటింగ్ పూర్తి చేసుకుని తిరిగి బైక్లపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గేదెలు అడ్డురావడంతో ఒక్కసారిగా సమీప బావిలోకి యువకుల బుల్లెట్ వాహనం దూసుకెళ్లింది.
ఏలూరు: ద్వారకాతిరుమలలో శ్రీవారి గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనుంది. శేషాచల కొండ చుట్టూ 6 కి.మీ. మేర భక్తులు, గోవింద స్వాములు గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చిన వెంకన్న పాదాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభంకానుంది.
ప.గో. జిల్లా: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం సంభవించింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.
ఏలూరు జిల్లా: బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకి పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.