Home » Education
జేఎన్టీయూలో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్చాన్స్లర్ సమాలోచనలు చేశారు.
ఎట్టకేలకు జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి.
విద్యార్థులను జేఎన్టీయూ నిలువునా దోచుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కు యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్లను, ప్రాజెక్టుల సమర్పణకు పర్మిషన్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్న జేఎన్టీయూ పరిపాలన విభాగం.. వన్టైమ్ చాన్స్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసిన పీజీ అభ్యర్థులపై పెనాల్టీలను బాదుతోందని ఆరోపిస్తున్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్ ఆశించే పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
ఉన్నత చదువులు కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వివిధ యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తేవడంలో జేఎన్టీయూ నిర్లక్ష్యం వహిస్తోంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
భారత విద్యావ్యవస్థలో మరిన్ని మంచి మార్పులు త్వరలో రాబోతున్నాయి. దండగమారి చదువులంటూ వస్తున్న విమర్శల్ని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కల్గిన అభ్యర్థులు దొరకడంలేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టేలా నిర్మాణాత్మక చర్యలు జరుగబోతున్నాయి.
రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని తెలిపారు.