Home » Education
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .
పీహెచ్డీ(PHD) చేయాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులు కూడా పీహెచ్డీ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్(UGC Chairman) జగదీష్ కుమార్(Jagadesh Kumar) ప్రకటించారు. దీంతోపాటు గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు ఎంచుకున్న సబ్జెక్ట్లో పీహెచ్డీ చేయవచ్చని ఛైర్మన్ తెలిపారు.
పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..
రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్ఎ్సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్ డంప్’ ద్వారా డిన్నర్ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్ఫోన సిగ్నల్స్, కాల్డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది.
పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.