Home » Education News
దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.
అమెరికాలో ఉద్యోగం, ఉన్నత చదువులు ఆశించే అంతర్జాతీయ అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. H-1B వీసాల విరామం, ప్రక్రియలో భారీ మార్పులు సూచిస్తూ అమెరికా సెనేట్లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ నూతన బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు.
నీట్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లీక్ కారకులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్నామని, నిందితులను జైల్లో పెట్టామని పేర్కొన్నారు.
విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
చదువుతో పేదరికాన్ని జయించవచ్చని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తాను ట్యూషన్స్ ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
ఏపీ ఎప్సెట్ ఫలితాలు (AP EAPCET 2026) వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేశారు.
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది.
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా మూడో భాషను తప్పనిసరి అర్హతా సబ్జెక్టుగా ప్రకటించింది.
జేఎన్టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.