Home » Education News
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, పేరుకుపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఈఏ, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర శివారులోని ఓ ఫంక్షన హాలులో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సును నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది.
పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను..
కొత్త విద్యాసంవత్సరం(2024–25) నుంచి 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)’ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది.
Summer Holidays for Inter Colleges: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ ప్రకటన ప్రకారం..
డిగ్రీ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది.