Home » East Godavari
Andhrapradesh: స్వగ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామంలోనే దళితులు ఎదురుతిరిగారు. గోపాలపురం సిద్దార్థ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఒరిస్సాకు చెందిన ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఒరిస్సాలోని సబరంగాపూర్ నుంచి విజయవాడకు బస్సు వెళుతోంది. టైరు పంక్చర్ అయి బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పది స్థానాల అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో అసమ్మతి నేతలు వరుసగా గళం వినిపిస్తున్నారు. ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే రంగనాథరాజుని అచంట నియోజకవర్గం నుంచి నిలబెట్టవద్దని అధిష్ఠానానికి సూచిస్తున్నారు.
Andhrapradesh: జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని నల్లజర్ల, కొయ్యలగూడెం మండలాల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం కలవరానికి గురిచేస్తోంది. గత అర్ధరాత్రి సమయంలో నల్లజర్ల మండలం పోతవరం గ్రామ పొలాల్లో..
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
కాకినాడ: వైసీపీ సర్కార్పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా..వైసీపీ ఏమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ వేధిస్తున్నారంటూ ఓ మహిళ సంచలన ఆరోపనలు చేసింది. వారికి తోడు పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేసింది.
ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Andhrapradesh: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోడిపందేలు,గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందెం బరులు వెలువగా.. ప్రేక్షక పాత్ర వహించడం పోలీసులవంతైంది.