Home » East Godavari
కార్తీక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పన, తెప్పోత్సవం, గిరిప్రదక్షణ లపై ఆదివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఈవో, చైర్మన్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: దసరా సెలవులు ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై సదరు విద్యార్థిని తండ్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేయడంతో స్కూల్ యాజమాన్యం ఆ బాలిక పట్ల...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించిన పోలీసులు వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ను అరెస్టు చేశారు.
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు
నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.
దొంగతనం కేసులో రికవరీ చేసిన డబ్బు, బంగారంలో నొక్కుడు... పేకాట రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడితే వాటా... పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలంటే లంచం...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 2019ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహించిన కోమసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు.
జిల్లాలోని పోలీసింగ్ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. బాస్ సమర్థుడే అయినా సిబ్బంది హద్దులు మీరడం.. కేసులను తారుమారు చేయడం.. గంజాయి పల్లెలకూ పాకిన దౌర్భాగ్యం వెరసి జిల్లా పోలీసు శాఖపై ఆరోపణలు అలముకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దాష్టీకాలు జరిగినా లాఠీ బయటకు తీయలేదు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ను రాష్ట్రం లో నెంబర్వన్ చేయడమే లక్ష్యమని, గత ఐదేళ్ల లో వైసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన నామినేటెడ్ పాలకవర్గం బ్యాంక్ను దివాళా వైపు నడిపించిం దని, డిపాజిట్ల సేకరణ లేదని, అప్పులు కూడా వసూలు చేయలేదని, అవ