Home » Donald Trump
శాంతి మండలి సమావేశాల సందర్భంగా తన ఎడమ చేతికి టేబుల్ తగలడంతో స్వల్ప గాయమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చేతికి గాయంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.
తమపై జరిగే ఎలాంటి దాడినైనా యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. తమ శక్తియుక్తులతో దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి 'డెడ్ ఎకానమీ' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం, దేశంలో వస్త్ర పరిశ్రమను రక్షించడానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
అమెరికా ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గారని, 800 మంది ఉరిశిక్షలను రద్దు చేశారని కొద్ది రోజులుగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్కు చెందిన ప్రముఖ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పష్టం చేశారు.
ఇరాన్లో ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఆ దేశ నాయకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులను అణిచివేస్తోందనే కారణంతో ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భవిష్యత్తులో ఆ దేశమే ఎక్కువగా నష్టపోతుందని జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ ఉద్యక్షుడు జెలెన్స్కీతో గురువారంనాడు సమావేశమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి బోర్డును ప్రారంభించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2025 వేదికగా దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు.
మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. చాలా మంది కింద పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మే నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే.. నికోలస్ మదురో దగ్గర గార్డ్గా పని చేసిన ఓ వ్యక్తి మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గ్రీన్లాండ్కి మద్దతు ఇచ్చే దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. వివరాల్లోకి వెళితే..