Home » Donald Trump
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయానికి మద్దతు తెలిపారు. రష్యాతో ఇంకా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు న్యాయమైనవే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈయూ దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. దీనిపై యూరోపియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి..
కిమ్కు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టిన నేవీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్కు ఈ బాధ్యత అప్పగించింది.
ట్రంప్ ప్రాపకం కోసం భారత్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న పీటర్ నవారో మాటలన్నీ అబద్ధాలని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' తేల్చి చెప్పింది. నవారో పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలు తప్పని నిర్ధారించింది.
డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో కూడా మరోసారి..
మోదీ తనకెప్పటికీ ఫ్రెండేనన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్పై భారత ప్రధాని తాజాగా స్పందించారు. తనదీ ఇదే భావన అని అన్నారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, అభివృద్ధికారక భాగస్వామ్యం ఉందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
భారత్తో స్నేహ సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ పన్నుల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ను చైనాకు కోల్పోయాం అంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గూగుల్తో పాటు యాపిల్ కంపెనీలకు అండగా నిలిచారు. యురోపియన్ యూనియన్ తమ దేశానికి చెందిన కంపెనీలపై భారీ జరిమానాలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
భారత్ను కోల్పోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ గురించి స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ఈ అంశంలో ప్రస్తుతానికి మాట్లాడేందుకు ఏమీ లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.
ఎస్సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.