Home » Devotees
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది.
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.