Home » Delhi
జమ్మూకశ్మీర్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు సంబంధించి ఏడుగురికి పైగా అనుమానితులను ఇంతవరకూ అరెస్టు చేసారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు నేరుగా ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఢిల్లీ కాలుష్యంపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈరోజు ద్వారకలో యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులకు గ్యాంగ్ స్టర్ హిమాన్షు భావు ముఠా సభ్యుడు అంకిత్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్కు అవసరమైన లాజిస్టిక్స్ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్ను సేకరించేందుకు ఉమర్కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషోర్ చౌరాసియా కోడలు దీప్తీ చౌరీసియా ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ, వసంత్ విహార్లోని ఇంట్లో ఆమె దుపట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.