Home » Delhi-NCR
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని(Delhi) పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై(Air Pollution) దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్య సమస్య వేధిస్తోంది. వారికి ఉపశమనం కలిగించాయి వర్షాలు. గత రాత్రి ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రిపూట వర్షం కురవడంతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు(Weather Scientist) చెబుతున్నారు.
ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న వేళ సుప్రీంకోర్టు(Supreme Court) చేసిన కీలక సూచనల తర్వాత ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్(Cabs)ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్(Arving Kejriwal) ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ఎంతలా అంటే అక్కడి పాఠశాలలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించేంతలా! బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్ రద్దు చేసుకునేలా. ఇంతటి కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాజధాని ప్రజల్ని అందులోంచి బయటపడేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
దేశ రాజధానిలో రోజు రోజుకి వాయు కాలుష్య(Delhi Pollution) తీవ్రత పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ గురువారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 256 పాయింట్లుగా రికార్డ్ అయి ఎయిర్ క్వాలిటీ పేలవంగా మారింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మళ్లీ "రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్" ప్రచారం ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఇంజిన్ ఆపేయాలని చెప్పడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం.
ఢిల్లీని ఈ ఏడాది కూడా కాలుష్యం పట్టిపీడించనుందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇవాళ ఉదయాన్నే దేశ రాజధానిని పొగ మంచు కప్పేసింది. దీంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాయు నాణ్యత సూచిలో ఢిల్లీ(Delhi) దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత సోమవారం చాలా పేలవమైన కేటగిరీకి పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) స్పష్టం చేస్తోంది. ఈ సీజన్ లో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఇవాళ సమావేశం నిర్వహించారు.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రతరం కావడంతో ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం...