Share News

Delhi: తగ్గుముఖం పట్టిన శీతల గాలులు.. పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడంటే!

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:07 AM

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శీతల గాలుల ప్రభావంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల గడువు ముగియండంతో మరోసారి గడువు పొడగిస్తున్నట్లు ఇటీవల మరో ఉత్తర్వు వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శనివారం రాత్రి నిర్ణయం వెలువరించింది.

Delhi: తగ్గుముఖం పట్టిన శీతల గాలులు.. పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడంటే!

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శీతల గాలుల ప్రభావంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల గడువు ముగియండంతో మరోసారి గడువు పొడగిస్తున్నట్లు ఇటీవల మరో ఉత్తర్వు వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శనివారం రాత్రి నిర్ణయం వెలువరించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శీతాకాలపు సెలవులను వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 10 వరకు పొడిగించినట్లు అంతకుముందు డైరెక్టరేట్ పేర్కొంది.

ఈ క్రమంలో కొంత పొరపాటు జరిగిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. "శీతాకాల విరామాన్ని పొడిగించే ఉత్తర్వు తప్పుగా జారీ అయింది. ఆర్డర్ వెంటనే ఉపసంహరించుకున్నాం" అని చెప్పారు. సెలవులు శనివారంతో ముగియనుండగా, సోమవారం తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో ఇటీవల శీతలగాలుల ప్రభావం పెరిగింది. దీంతో వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Updated Date - Jan 07 , 2024 | 08:08 AM