Home » Delhi-NCR
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్లో బస్సులు బస్టాప్లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన చలి(Winter Season)తో వణుకుతున్నారు. ఈ సీజన్ లో శనివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇవాళ నమోదైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో 3.8 డిగ్రీల చలితో ప్రజలు వణికిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శీతల గాలుల ప్రభావంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల గడువు ముగియండంతో మరోసారి గడువు పొడగిస్తున్నట్లు ఇటీవల మరో ఉత్తర్వు వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శనివారం రాత్రి నిర్ణయం వెలువరించింది.
ఏ ప్రియుడైనా ప్రియురాలికి గిఫ్ట్ గా ఏమిస్తాడు. ప్రత్యేక సందర్భాలుంటే చాక్లెటో, చీరో.. ఇంకొంచం రిచ్ ఫీలింగ్ రావాలంటే వారి ఆర్థిక స్థోమతను బట్టి బంగారమో, డైమండ్ నెక్లెసో చేయిస్తాడు. కానీ ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం ఏకంగా రూ.100కోట్ల బిల్డింగ్ నే గిఫ్ట్ గా రాసిచ్చాడు. ఓ కేసు విషయమై ఆ బిల్డింగ్ లోకి విచారించగా విస్తుగొలిపే నిజాలు బయటకి వచ్చాయి.
ఢిల్లీని పొగమంచు(Fog) వణికిస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత(Air Quality) దారుణంగా పడిపోయింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది.
బాణసంచా కాల్చడంతోనే ఢిల్లీలో వాయు నాణ్యత తగ్గిందని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా(Kapil Mishra) అన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) గత వారం నుంచి 500 పాయింట్లుగా నమోదైతే.. దీపావళి తరువాత కేవలం 296 పాయింట్లే నమోదైందని తెలిపారు.
Air Quality: వాయు కాలుష్యం దేశ రాజధాని ప్రజల్ని భయపెడుతోంది. కాలుష్య(Air Pollution) ప్రభావంతో జలుబు, దగ్గు, ఆస్తమా తదితర రోగాలతో పబ్లిక్ ఆసుపత్రులపాలవుతున్నారు. దీంతో ఢిల్లీ(Delhi) సర్కార్ ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని(Delhi) పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై(Air Pollution) దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.