Share News

AQI: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:51 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత(Air Quality) దారుణంగా పడిపోయింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది.

AQI: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత(Air Quality) దారుణంగా పడిపోయింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది. వాయు నాణ్యత ప్రస్తుతం తీవ్రమైన కేటగిరీలోకి ప్రవేశించింది. నిర్మాణ పనులపై నిషేధం, వాహనాలపై ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉండటంతో వాటిని కఠినంగా అమలు చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీ అంతటా AQI క్రమంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి 405 పాయింట్లకు చేరింది. దీనికి తోడు చలికాలం కావడంతో శనివారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రాబోయే 24 గంటల్లో దేశ రాజధానిలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


మెరుగుపరిచే అవకాశం లేదు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ మాట్లాడుతూ.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III ఢిల్లీలో అమలులోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యవసరం కాని నిర్మాణ పనులు, BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్ల వాహనాలపై నిషేధం విధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఉత్తర్వులు జారీ చేసింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన ప్లస్" విభాగంలోకి వస్తుంది.

Updated Date - Dec 23 , 2023 | 09:51 AM