Home » Cyber attack
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పేర్లతో ఏపీకే లింక్లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్కు ‘పీఎం కిసాన్’ పేరుతో ఏపీకే లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫోన్కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకుంది.
కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు.
అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మలక్పేట్కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్, లివింగ్ రిలేషన్ పార్టనర్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్లో లాగిన్ అయ్యాడు.
ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీగా బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
పెన్షన్ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఇస్తామని ఏపీకే లింక్లు పంపిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్పురాలో నివసించే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ అందిస్తామన్న ప్రకటనను ఫేస్బుక్లో చూశారు.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.