Home » Crime News
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.
రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గట్టయ్య సెంటర్ సమీపంలో భార్యపై అనుమానంతో భర్త దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో ఎన్ఐఏ మరో పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురుని శ్రీనగర్ లో ఇవాళ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం విశేషం. ఢిల్లీలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోవడంతో 15 మంది..
ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లిఫ్ట్లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్(5) అనే బాలుడు అపార్ట్మెంట్లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.