Home » CPI
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... జగన్ అంటున్న 175 స్థానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురువారం మీడియాతో సీపీఐ నేత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ఎదురు ఈదుతున్నారని.... జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమే అని స్పష్టం చేశారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.
Andhrapradesh: విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్పై కమలం పార్టీ గురి పెట్టింది.
Telangana: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరదీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ(Ramakrishna) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు పూర్తయ్యాక విశాఖపట్నం నుంచి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణమని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.