• Home » CPI

CPI

CPI Leader: ప్రధాని మోదీ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రావాలి!

CPI Leader: ప్రధాని మోదీ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రావాలి!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఇండియా కూటమి బలం మరింత పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరిన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌(CPI State Secretary Muttharasan) కోరారు.

CPI: మన్యం స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించడంపై రామకృష్ణ ఫైర్

CPI: మన్యం స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించడంపై రామకృష్ణ ఫైర్

Andhrapradesh: మన్యంలో స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు అదానీకి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు.

AP Politics: జగన్ 175 స్థానాలపై రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

AP Politics: జగన్ 175 స్థానాలపై రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... జగన్ అంటున్న 175 స్థానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురువారం మీడియాతో సీపీఐ నేత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ఎదురు ఈదుతున్నారని.... జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమే అని స్పష్టం చేశారు.

LS Polls: బెంగాల్‌లో దోస్తీ, కేరళలో కుస్తీ.. ఇండియా కూటమిలో లుకలుకలు బీజేపీకి కలిసొస్తుందా!

LS Polls: బెంగాల్‌లో దోస్తీ, కేరళలో కుస్తీ.. ఇండియా కూటమిలో లుకలుకలు బీజేపీకి కలిసొస్తుందా!

రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.

Lok Sabha Elections: సీపీఐ మేనిఫెస్టో విడుదల.. పార్లమెంటు పరిధిలోకి ఈడీ, సీబీఐని తెస్తామని వాగ్దానం

Lok Sabha Elections: సీపీఐ మేనిఫెస్టో విడుదల.. పార్లమెంటు పరిధిలోకి ఈడీ, సీబీఐని తెస్తామని వాగ్దానం

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.

CPI: విశాఖ పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేతపై రామకృష్ణ రియాక్షన్

CPI: విశాఖ పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేతపై రామకృష్ణ రియాక్షన్

Andhrapradesh: విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు.

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

CPI: బెడ్‌రెస్ట్‌లో సీపీఐ నేత నారాయణ.. ఏం జరిగిందంటే?

CPI: బెడ్‌రెస్ట్‌లో సీపీఐ నేత నారాయణ.. ఏం జరిగిందంటే?

Telangana: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం

ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.

Kunamneni Sambasivarao: వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ సరైంది కాదు

Kunamneni Sambasivarao: వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ సరైంది కాదు

Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్‌సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్‌సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి