Home » CJI
సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారు అమాయక ప్రజలను మోసంచేసి కోట్ల రూపాయలు కాజేసే పరాన్నజీవులని పేర్కొంది. ఇలాంటి వారిపై మరింత కఠినతర చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
మీనాక్షి నటరాజన్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రక్రియలో తాము మధ్యంతర జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ ఈ పిటిషన్ను కొట్టివేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ లీక్ కేసుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్వకపోవడంపై ఎన్టీఏ తీరును తప్పుపట్టింది.
కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని, వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. తన నోటి మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని, దేశంలోని యువతను విమర్శించినట్టుగా తప్పుగా చిత్రీకరించిందని అన్నారు. తాను దేశ యువతను విమర్శించాననడం పూర్తిగా నిరాధారమని అన్నారు.
కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో సీజేఐ సూర్యకాంత్ పోల్చారు. వాళ్లు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీస్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం పోలీసులు బాధితురాలికి ఇంటికి వెళ్లకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. అలా వ్యవహరించేందుకు వాళ్లేమైనా రాజులా అని వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై ఆమె రికార్డు నెలకొల్పారు.
ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం వల్ల సీజేఐపై షూ విసిరిన లాయర్కు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని, ఈ ఘటన దానంతటదే సద్దుమణుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.