Home » China
చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు తప్ప తాగి చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులు భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన చైనాలోని ఎంతో మంది పేరెంట్స్కు కనువిప్పుగా నిలుస్తోంది. మార్చి నెలలో షాంఘైలోని హైడిలావ్ హాట్పాట్కు ఇద్దరు యువకులు వెళ్లి మద్యం సేవించారు.
చైనాపై నాటో దేశాలు 100 శాతం వరకూ సుంకాలు విధించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునివ్వడంపై చైనా స్పందించింది. ఈ ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని హెచ్చరించింది. చైనా ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకోదని విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఒక గ్రూపుగా నాటో దేశాలు చైనాపై విధించే 50 శాతం నుంచి 100 శాతం సుంకాలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియగానే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని, ఈ చర్య యుద్ధం ముగియడానికి గొప్ప సహకారి అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఉద్యోగులను సంతోషపరిచేందుకు చాలా కంపెనీలు బోనస్లు, ట్రిప్లు, బహుమతులు ఇస్తుంటాయి. అయితే ఒక చైనీస్ టెక్ కంపెనీ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. ఉద్యోగులను ఫిట్గా, ఆరోగ్యంగా మార్చాలని సంకల్పించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మాట వినిపిస్తున్నారు. ఒకపక్క భారత్తో స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతూనే భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, భారత్, చైనాపై 100 శాతం సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల రూపంలో విసురుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొవాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్...
డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో కూడా మరోసారి..
సరిహద్దు ప్రాంతమైన లిపూలేఖ్ పాస్ మీదుగా భారత్తో వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇది భారత్, నేపాల్కు చెందిన ద్వైపాక్షిక అంశమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.