Home » China
చైనాలోని ఒక బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 82 మంది మృతి చెందారు. షాంగ్జీ ప్రావిన్స్లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో విదేశీ ప్రతినిధులు, టెక్ ఎగ్జిక్యూటివ్లపై చైనా గూఢచర్యం జరిపిందనే వార్త కలకలం రేపుతోంది. బీజింగ్లో జరిగిన విందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వెనుక ఒక వెయిట్రస్ నిలబడింది.
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం కుప్పకూలింది. చైనా సహాయంతో తయారు చేసిన ఈ జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లను పాక్ ఎయిర్ఫోర్స్ వినియోగిస్తోంది. తాజాగా తమ పైలట్లకు పాక్ ఎయిర్ఫోర్స్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఇది కుప్పకూలింది.
చైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ ప్రావిన్స్లో సంభవించిన భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
హోర్ముజ్ జలసంధిలో చైనాకు చెందిన ఒక నౌకను ఇరాన్ సీజ్ చేసింది. ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన ఈ నౌకను తనిఖీల పేరిట ఇరాన్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం చైనాతో పోరాడడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఇటీవల చైనా పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా చేరుకున్న ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.
పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో యూఎస్ అధికారులు చైనాలో ఇచ్చిన గిఫ్టులు ఇతర వస్తువులను అక్కడే వదిలివెళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తైవాన్కు అమెరికా సైనిక సహకారం అందించటంపై గుర్రుగా ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. అగ్రరాజ్యాధినేతకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు.
బీజింగ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పై ప్రశంసల జల్లు కురిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో చైనాపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్, ఇప్పుడు ఫుల్ యూ టర్న్ తీసుకున్నారు.
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్కు చేరుకున్నారు. చివరిసారి 2017లో ట్రంప్ చైనా వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరాన్ యుద్ధం, చైనాతో ట్రేడ్ వార్, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.