Home » Chevireddy Bhaskar Reddy
Andhrapradesh: చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
పది రూపాయలకే రెండు క్వార్టర్ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.
Andhrapradesh: వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.
ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.
Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..