Home » Chennai News
ఊహించలేనిది జరిగింది... ఏ రకంగాను మీ నష్టాన్ని భర్తీచేయలేం... ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటా... త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా’ అంటూ కరూర్ మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు.
కరూర్ తొక్కిసలాట ఘటనతో తీవ్రంగా నష్టపోయిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే).. నష్టనివారణ చర్యలకు దిగిందా?.. అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైందా?.. ఆ పార్టీ అధినేత విజయ్ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు.
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంలో విస్తరించిన కారణంగా ఈ నెల 9వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
కరూర్లో తమిళ గ వెట్రి కళగం (టీవీకే) రాజకీయ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఎంపీల నిజనిర్ధారణ కమిటీ విజ్ఞప్తి చేసింది.
కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ టీవీకే నేత విజయ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి అన్నారు.
వెండి తెరపై నటించినంతగా రాజకీయాల్లో నటించడం సులభం కాదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ అప్పావు వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో శుక్రవారం డీఎంకే కూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రప్రజల అండదండలతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 210 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారం చేపడతామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా పెంపుడు జంతువులను పర్యవేక్షించేందుకు వాటికి మైక్రో చిప్ అమర్చేందుకు, లైసెన్స్ తదితర సేవలను జతచేస్తూ కొత్తగా రూపొందించిన వెబ్సైట్ను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ ప్రారంభించారు.
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.