Home » BJP
ముసాయిదా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బాగంగా బిహార్లోని మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. వారి దరఖాస్తుల్లోని వివరాల మధ్య వ్యత్యాసాలను అధికారులకు వచ్చి వివరించాలని ఈసీ ఆదేశించింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రామచందర్ రావు కామారెడ్డికి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు బీజేపీ అండగా ఉండనుందని భరోసా ఇవ్వనున్నారు.
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమయ్యింది.
రిటైర్మెంట్కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరెస్సెస్ సర్సం్ఘచాలక్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.