Home » BJP
బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ప్రస్తుతం పండిట్ పంత్ మార్గ్ నుంచి పని చేస్తు్న్న ఢిల్లీ బేజీపీ కార్యాలయం ఇక నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ నుంచి పనిచేయనుంది.
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నూతన ఎన్నికల చార్జులను నియమించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్లను ఇన్చార్జ్లుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీఎస్టీ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, బాంబే వంటి అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటు ద్వారా వెనుకబడిన గ్రామాలు అభివృధి చెందుతున్నాయని తెలిపారు.
ప్రధాని జన్ ధన్ ఖాతాలు తెరిపించి బ్యాంకులకు చేరువ చేశారని.. దిక్కు లేని వారికి మోదీ దిక్కయ్యారని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. 4 కోట్ల మందికి ఆవాసం నిర్మించారన్నారు.
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన డిక్లరేషన్లు అమలు చేయడం లేదని రామచందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ పోస్టులను కనీసం భర్తీ చేయలేకపోతుందని.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఒక హోటల్ రూమ్లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ ఒక విద్యార్థి పట్టుబడ్డాడు. SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ అష్హార్ డానిష్ అనే యువకుడు..