Home » Bhatti Vikramarka Mallu
రాష్ట్ర శాసన సభా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు.. 12 రోజులపాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి, సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల అనుమతు లు, నిధులు, విభజన సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఎంపీలంతా ఏకం కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది మహిళల తో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సినీ కళాకారుల మాదిరిగానే రంగస్థల కళాకారులకూ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగ పోటీలను నిర్వహించి ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.