Home » Banks
RBI కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
RBI నిబంధనల ప్రకారం, 2026 జూన్ నెలలో ప్రాంతీయ పండుగలు, జాతీయ వేడుకలు, వారాంతపు సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఆయా దినాల్లో పనిచేయవు. జూన్ నెలలో బ్యాంకుకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.
రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని కస్టమర్లను వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రతిపాదించింది.
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం పలు బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. వారానికి ఐదు రోజులు పని, వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. అయితే బ్యాంకు ఖాతాదార్లు కొందరు సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మన దగ్గర గోల్డ్ ఉంటే, తక్షణ అవసరాలకు అక్కరకొస్తుంది. బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే, దీనికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులకు అప్పుఇస్తే, వాళ్లే మనకి వడ్డీ ఇస్తారని తెలుసా..
తీసుకున్న అప్పులపై బ్యాంకులకు చెల్లించే ఈఎంఐల మొత్తం తగ్గితే రుణగ్రహీతలు ఆనందిస్తారు. ఇవాళ్టి నుంచి కెనరా బ్యాంకు తన ఖాతాదారులకి ఇలాంటి అవకాశమే అందించింది. ఇక నుంచి సదరు బ్యాంకు ఖాతాదార్లు కట్టే ఈఎంఐల మొత్తం తగ్గుతుంది.
రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..
భారత సంస్కృతి, సాహిత్యానికి ఆదర్శంగా నిలిచిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7, 2025న మంగళవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. అయితే ఎక్కడెక్కడ సెలవు ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.