Home » Ballari
రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శుక్రవారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ జిల్లాల జిల్లాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్గేట్లకు పరిమితం చేశారు.
ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం కేశ్వన్ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్ఎల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్ఎల్సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.
కాంగ్రెస్లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.
తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గడంతో 8 క్రస్ట్గేట్లు క్రిందకు దించి కేవలం 13క్రస్ట్గేట్ల గుండా మాత్రమే దిగువకు వరద నీరు విడుల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
తుంగభద్ర పైభాగం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.