Home » Avanigadda
Andhrapradesh: మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని జనసేన, టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో వారిపై కర్ర తీసుకుని వెంటపడ్డారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు (శుక్రవారం) ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి హామీల సాధన కోసం వరుస నిరసనలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది.
మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
జిల్లాలోని అవనిగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అవనిగడ్డలో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు.
కృష్ణాజిల్లా: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పర్చూరి సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరులు టీడీపీలో చేరనున్నారు. సుభాష్ చంద్రబోస్తో పాటు అవనిగడ్డ, కోడూరు మండలాల నుంచి చేరికలు ఉండనున్నాయి.
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పిలుపిచ్చారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి బిగ్ షాక్ (Big Shock) తగిలింది. ఆ నియోజకవర్గం కీలకనేత పరుచూరి సుభాష్ చంద్ర బోస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.