Share News

AP News: తండ్రిని చంపి.. ఆపై ఇంట్లోని మంచంపైనే తగులబెట్టిన తనయుడు

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:54 PM

Andhrapradesh: జిల్లాలోని నాగాయలంక మండలం బావదేవరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థలం వివాదంలో కన్న తండ్రిని చంపి తగులబెట్టాడు కొడుకు. ఇళ్ల స్థలం అమ్మమంటే అంగీకరించ లేదని తండ్రి బండి హరిమోహనరావును కుమారుడు పవన్ కళ్యాణ్ కొట్టి పడేశాడు.

AP News: తండ్రిని చంపి.. ఆపై ఇంట్లోని మంచంపైనే తగులబెట్టిన తనయుడు

కృష్ణా: జిల్లాలోని నాగాయలంక మండలం బావదేవరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థలం వివాదంలో కన్న తండ్రిని చంపి తగులబెట్టాడు కొడుకు. ఇళ్ల స్థలం అమ్మమంటే అంగీకరించ లేదని తండ్రి బండి హరిమోహనరావును కుమారుడు పవన్ కళ్యాణ్ కొట్టి పడేశాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి అక్కడికక్కడే చనిపోవడంతో ఇంటిలోనే మంచంపై పడేసి తగులబెట్టేశాడు. మృతుడు బండి హరి మోహనరావు భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. తాపీ పని చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు హరిమోహనరావుకు మధ్య ఇళ్ళ స్థలం అమ్మకం విషయంలో అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఎంతకీ ఇళ్ళ స్థలం అమ్మటానికి అంగీకరించకపోవడంతో పవన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన వెంటనే అవనిగడ్డ సీఐ రమేష్, నాగాయలంక ఎస్సై సుబ్రమణ్యం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Updated Date - Dec 16 , 2023 | 12:59 PM