Home » Avanigadda
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
Andhrapradesh: మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుద్ధప్రసాద్కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. అవనిగడ్డ 2 వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఏం జరుగుతోందో అధిష్టానానికే తెలియని పరిస్థితి. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 7 విడతలుగా 66 మందికి పైగా దాదాపు అభ్యర్థులను జగన్ ప్రకటించారు..
Andhrapradesh: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తుఫాను కారణంగా పంట నష్ట పోవడంతో అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తకెళ్ళ శ్రీ పూర్ణయ్య(35) పురుగు మందు తాగాడు.
Andhrapradesh: జిల్లాలోని నాగాయలంక మండలం బావదేవరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థలం వివాదంలో కన్న తండ్రిని చంపి తగులబెట్టాడు కొడుకు. ఇళ్ల స్థలం అమ్మమంటే అంగీకరించ లేదని తండ్రి బండి హరిమోహనరావును కుమారుడు పవన్ కళ్యాణ్ కొట్టి పడేశాడు.
Andhrapradesh: మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.