Share News

AP News: అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థుల మెరుపు ధర్నా

ABN , First Publish Date - 2023-12-12T12:11:21+05:30 IST

Andhrapradesh: మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు.

AP News: అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థుల మెరుపు ధర్నా

కృష్ణా: మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు మంగళవారం మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒకేసారి వందల సంఖ్యలో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి అభ్యర్థులు నినాదాలు ప్రారంభించారు. సున్నాలతో నోటిఫికేషన్ వద్దని వెంటనే ఇచ్చిన హామీ మేరకు మెగా నోటిఫికేషన్ ఇవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు బాసటగా మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వెనక్కు వెళ్ళాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించి మరీ అభ్యర్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-12-12T12:12:26+05:30 IST